Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైనాకు ట్రంప్ హెచ్చరిక
వాషింగ్టన్ : వాణిజ్య చర్చలు ఫలవంతం కాని కాకపోతే చైనా దిగుమతులపై అధిక సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ శుక్రవారం హెచ్చరించారు. ''దీన్ని నివారించేందుకు చైనా పలు చర్యలు గైకొనాల్సి వుంటుంది. సుంకాల పెంపు సెప్టెంబరు 1 నుంచి అమలులోకి వస్తుంది'' అని ట్రంప్ అన్నారు. దాదాపు 300 బిలియన్ డాలర్ల చైనా ఉత్పత్తులపై 10 శాతం సుంకాన్ని విధిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతకుముందు 250 బిలియన్ డాలర్ల చైనా ఉత్పత్తులపై 25 శాతం దిగుమతి సుంకాలను విధించగా, దానికి ఈ 10 శాతం అదనం. అమెరికా-చైనాల మధ్య మలివిడత వాణిజ్య చర్చలు సెప్టెంబరులో జరగనున్నాయి. చర్చలు ఫలవంతం కాకపోతే తాను కోరుకున్న విధంగా అధిక మొత్తంలో సుంకాలు విధించగలనని అన్నారు. తాను అధ్యక్ష పదవిలోకి రాకముందు చైనా కన్నా అమెరికా ఎంతో వెనుకబడి ఉన్నదన్నారు. అమెరికా పట్ల సరిగా వ్యవహరించేది కాదన్నారు. ''దీనికి చైనాను నిందించడం లేదు. గత నాయకులు, గత అధ్యక్షులు, వాణిజ్య ప్రతినిధులను నిందిస్తున్నాను. వారు చాలా దారుణంగా వ్యవహరించారు'' అని ట్రంప్ అన్నారు.