Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 108కి చేరిన మృతుల సంఖ్య
ఢాకా : వరదల్లో చిక్కుకొని మృతి చెందినవారి సంఖ్య ఆదివారం నాటికి 108కి చేరుకుందని అధికారులు ధ్రువీకరించారు. 16 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ప్రాథమిక అవసరాల కొరతతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. వేలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. వరదల కారణంగా 60లక్షల మంది ఇబ్బందిపడుతున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ ఆస్తినష్టం సంభవించి ందన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ప్రధాని షేక్ హసీనా ఆదేశాలు జారీ చేశారు. రెడ్ క్రాస్ బృందాలు, బంగ్లా ఆర్మీ సహాయక చర్యల్లో నిమగమైంది. వరద బాధితులకు ఆహారం, మందులు అందజేస్తున్నాయి.