Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తిరుగుబాటుదారుల వైమానిక దాడిలో 42 మంది మృతి
ట్రిపోలి : లిబియాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. వివాహ వేడులకలను లక్ష్యంగా చేసుకొని తిరుగుబాటుదారులు వైమానిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 42 మంది మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం...ముర్కజ్ నగరంలో ఓ వివాహ వేడుకను లక్ష్యంగా చేసుకొని తిరుగుబాటుదారులు వైమానిక దాడికి పాల్పడ్డారు. దీంతో, పెండ్లి మంటపం రక్తసిక్తమైంది. వివాహానికి హాజరైనవారంతా ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తున్నట్టు ఏ ఉగ్రసంస్థ కూడా ప్రకటించుకోలేదు. జనరల్ హఫ్తార్ సంస్థకు చెందిన తిరుగుబాటుదారులే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని పోలీస్ అధికారులు అనుమానిస్తున్నారు.