Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 19 మంది మృతి, 30 మందికి గాయాలు
కైరో : ఈజిప్టులో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 19 మంది మృతి చెందగా, మరో 30 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. ఈ ఘటనకు ఉగ్రవాదంతో సంబంధాలున్నాయనే కోణంలో పోలీస్ అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. స్థానిక అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం..కైరో నగరంలో అతివేగంగా ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న మూడు కార్లను ఢకొీంది. దీంతో, మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. మంటలు పరిసర ప్రాంతాలకు దావానలంలా వ్యాపించాయి. ఈ ఘటనలో 19 మంది మృతి చెందారు. మరో 30 మంది స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన కైరోలోని క్యాన్సర్ ఆస్పత్రి ముందు జరగడంతో ఆస్పత్రిలోని రోగులంతా భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలంలో సహాయక చర్యలు చేపడుతున్నారు. మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను ప్రత్యేక అంబులెన్స్ల్లో తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. కారు డ్రైవర్ ఉద్దేశపూర్వకంగానే రాంగ్రూట్లో ప్రయాణించినట్టు కైరో ఎస్పీ అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నామని అన్నారు