Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాస్కో: సైబీరియాలో ఉన్న ఆయుధాల గోదాంలో పేలుడు సంభవించింది. క్రాస్నోయార్స్క్ నగరానికి పశ్చిమాన ఉన్న ప్రాంతం అచింక్ పట్టణానికి చేరువలో జరిగిన పేలుడు వల్ల 8 మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి తీవ్రంగా ఉన్నదని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో డిపోలో 10వేల ఫిరంగి గుండ్లు ఉన్నట్టుగా గుర్తించారు. కొంతమంది పేలుడుకు సంబంధించిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో అధికారులు ఎమర్జెన్సీ ప్రకటించారు. ఈ ప్రమాద ఘటన అనంతరం ముందస్తు జాగ్రత్తగా మూడు వేలమందిని అధికారులు అక్కడ నుంచి తరలిం చారు. మరో 11 వేలమందిని తరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. కాగా ఆ ప్రాంతంలో ఉండే సాధారణ వేడి వాతావరణం..బలమైన గాలులు వీస్తుంటం ప్రమాదానికి కారణం అయి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.