Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్యాబిన్లో చెలరేగిన మంటలే కారణం
లండన్ : బ్రిటన్ ఎయిర్లైన్స్కు చెందిన బీఏ-422 విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేసినట్టు ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. క్యాబిన్లో ఒక్కసారిగా మంటలు చెల రేగడంతో పైలట్ విమానాన్ని ల్యాండింగ్ చేశాడని అన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బీఏ-422లో 175 మంది ప్రయాణీకులు, ఆరుగురు క్యాబిన్ సిబ్బంది, ఇద్దరు పైలట్లు ఉన్నారని అన్నారు. ప్రయాణీకులను ప్రత్యేక విమానంలో గమ్యస్థానానికి తరలించామని అన్నారు. సాంకేతిక లోపం కారణంగా విమానాన్ని ల్యాండింగ్ చేసినట్టు పైలట్లు తెలిపారు. క్యాబిన్లో మంటలు చెలరేగడంతో ముగ్గురు ప్రయాణీకులకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తిందని అన్నారు. వీరిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించామని అన్నారు.