Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాబూల్ : అఫ్ఘాన్లో ఎన్నికల ర్యాలీలు తీసినట్టయితే దాడులకు పాల్పడతామంటూ తాలిబన్లు హెచ్చరించారు. ఈ మేరకు తాలిబన్ల అధికార ప్రతినిధి సుహేల్ షాహిన్ ఓ ప్రకటన జారీ చేశారు. కాగా, అప్ఘాన్లో సెప్టెంబర్28న అధ్యక్ష ఎన్నికలు జరుగను న్నాయి. ఈ ఎన్నికలను నిషేధించాలని తాలిబన్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే, దీనిపై అఫ్ఘాన్ సర్కారు మాత్రం స్పందించడంలేదు. పైగా, ఖతార్ నగరంలో తాలిబన్ నేతలకు, అఫ్ఘాన్ అధికారులకు మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్నాయి. ఈ చర్చలకు అమెరికా మధ్యవర్తిత్వం వహిస్తున్నది. అఫ్ఘాన్ నుంచి అమెరికా బలగాలు పూర్తిగా వైదొలిగినట్ట యితేనే చర్చల అంశంపై స్పందిస్తామంటూ తాలిబన్లు మెలికపెట్టారు. తాలిబన్ల ప్రతిపాదనకు అమెరికా అంగీకరించడంతో చర్చలు ప్రారంభమయ్యాయి.అయితే, ఈ చర్చలు ఓ కొలిక్కి రాకముందే అధ్యక్ష ఎన్నికలకు అఫ్ఘాన్ సర్కారు సమాయత్త మైంది. దీంతో, ఎన్నికల ర్యాలీలపై తాలిబన్లు నిషేధం విధించారు. అఫ్ఘాన్ నేతలు ర్యాలీలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించి నట్టయితే తమ డిమాండ్లు మరుగునపడే ప్రమాదముందని తాలిబన్లు భావిస్తున్నారు. ఈనేపథ్యంలో ఎన్నికల ర్యాలీలను నిషేధించారు.
గతనెలలో అఫ్ఘాన్ నేత అమ్రుల్లా కార్యాలయంపై తాలిబన్లు ఆత్మా హుతి దాడికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఈ దాడిలో 20 మంది మృతి చెందారు.