Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దక్షిణకొరియాలో జపాన్ వ్యతిరేక నిరసనలు
- ఆన్లైన్ పిటిషన్కు మద్దతుగా 20వేల మంది సంతకాలు
సియోల్ : అమెరికా, చైనా దేశాల మధ్య ప్రారంభమైన వాణిజ్య యుద్ధం తాజాగా దక్షిణకొరియా, జపాన్ దేశాలనూ తాకింది. మార్కెటింగ్ రంగంలో ఆధిపత్యం కోసం దక్షిణకొరియా, జపాన్ దేశాలు పాకులాడుతున్నాయి. రెండు మిత్రదేశాల మధ్య ట్రేడ్వార్ ప్రారంభం కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వస్తువుల ధరలు మిన్నంటే అవకాశముందని భీతిల్లుతున్నారు. జపాన్లో తయారైన వస్తువులను బహిష్కరించనున్నట్టు పలువురు కొరియన్లు డిమాండ్ చేస్తున్నారు. టోక్యో ఉత్పత్తులపై నిషేధం విధించాలనే డిమాండ్తో ఓ ఆన్లైన్ పిటిషన్ రూపొందించి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ పిటిషన్కు మద్దతుగా గంట సేపట్లో 20వేల మందికిపైగా సంతకాలు చేశారు. జపాన్కు వ్యతిరేకంగా కొంత మంది కొరియన్లు బ్యానర్లు, ప్లకార్డులు ప్రద ర్శించారు. దక్షిణకొరియాలో అత్యంత రద్దీగా ఉండే నామ్దేమన్ మార్కెట్ ఆవరణలో భారీ బ్యానర్ను ప్రదర్శించారు. ' మేం జపాన్కు వెళ్లం...అక్కడి ఉత్పత్తులనూ కొనుగోలు చేయం' అనే అక్షరాలను ఆ బ్యానర్పై ముద్రించారు. కాగా, జపాన్ పరిశ్రమల్లో పనిచేస్తున్న దక్షిణకొరియా కార్మికులు చాలీచాలని వేతనాలతో ఇబ్బందిపడుతున్నారు.
వీరికి కనీసం వేతనం దక్కడం లేదు. జపాన్ పరిశ్రమల యాజమాన్యాలు కార్మికులను అధిక పని గంటలు పనిచేయిం చుకొని తక్కువ వేతనం చెల్లి స్తున్నారనే ఆరో పణలు ఎదుర్కొం టున్నారు. జపాన్ పరిశ్రమల తీరుపై దక్షిణ కొరియా న్యాయ స్థానం గతవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో, దక్షిణ కొరియాకు ఎగుమతి చేస్తున్న పలు వస్తు వులపై భారీ సుంకాలు వసూలు చేయనున్నట్టు జపాన్ ప్రకటిం చింది. జపాన్ ప్రకటనపై కొరి యన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తు న్నారు. జపాన్ ఉత్పత్తులను బహిష్కరించాలని పలు స్వచ్ఛంధ సంస్థలు డిమాండ్ చేస్తు న్నాయి. ఈ మేరకు ఓ ఆన్లైన్ పిటిషన్ తయారుచేసి ప్రజా భిప్రాయాన్ని సేకరించే పనిలో నిమగ మయ్యాయి.