Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టెహ్రాన్ : అమెరికా బెదిరింపులకు తలొగ్గేది లేదని ఇరాన్ పునరుద్ఘాటించింది. ఇరాన్పై భారీ ఆంక్షలను మోపి రాజీకి రప్పించాలని అమెరికా ప్రయత్నిస్తోందని, ఇలాంటి చౌకబారు చర్యలకు ఇరాన్ రాజీపడదని అధ్యక్షుడు హస్సన్ రౌహానీ పేర్కొన్నారు. ఇరాన్పై ఆర్థిక ఉగ్రవాదానికి పాల్పడాలన్నదే అమెరికా లక్ష్యమని విమర్శించారు. ఇరాన్పై మోపిన ఆంక్షల ఎత్తివేత అంశంపై అమెరికా స్పందించినట్టయితే చర్చల అంశంపై పునరాలోచిస్తామని అన్నారు. ఇరాన్ విదేశాంగ మంత్రి మొహ్మద్ జవాద్ జరీఫ్తో భేటీ అనంతరం రౌహానీ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇరాన్ అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగిన సంగతి తెలిసిందే. అంతేగాకుండా, ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని మిత్రదేశాలపై అమెరికా ఒత్తిడి పెంచింది. ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై భారీ ఆంక్షలు మోపుతామంటూ హెచ్చరించింది. ఇరాన్ను ఒంటరి చేసేందుకు ఆ దేశంపై భారీ ఆంక్షలు మోపింది. సముద్ర జలాల్లో చమురు నౌకలపై దాడులు జరిగినట్టయితే... అది ఇరాన్ పనేనంటూ అంతర్జాతీయ సమాజాన్ని బురిడీ కొట్టించేందుకు అమెరికా ప్రయత్నిస్తున్నది. ఇరాన్పై భారీ ఆంక్షలు మోపి రాజీకి రప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నది. ఇస్లామిక్ దేశాలతో దశాబ్దాలుగా ఇరాన్ కొనసాగుతున్న ద్వైపాక్షిక సంబంధాలపై అమెరికా దెబ్బ తీసింది. అన్ని రకాలుగా ఇరాన్ను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోంది.