Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లాహోర్: పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె, పీఎంఎల్ఎన్ పార్టీ ఉపాధ్యక్షురాలు మరియం నవాజ్ మరోసారి అరెస్ట్ అయ్యారు. చౌద్రీ సుగర్ మిల్స్ కేసులో పాకిస్థాన్ నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (ఎన్ఏబీ) అధికారులు గురువారం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పాకిస్థాన్లో చౌదురీ షుగర్ మిల్స్ కేసులో మరియం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఎన్ఏబీ కోర్టు పలుమార్లు నోటీసులు జారీ చేసినా ఆమె పట్టించుకోలేదు. లాహోర్ కోట్ లక్పాట్ జైల్లో ఉన్న ఆమె తండ్రి మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ను కలిసేందుకు ఆమె వెళ్తుండగా అధికారులు ఆమెను అరెస్ట్ చేసినట్టు స్థానిక మీడియా వెల్లడించింది.