Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ మరోసారి తన గగనతల మార్గా లను మూసివేస్తూ సంచలన నిర్ణ యం తీసుకుంది. జమ్మూ కశ్మీర్ కున్న ప్రత్యేక ప్రతిపత్తి రద్దుకు నిరసనగా భారతదేశంతో వాణిజ్యాన్ని బంద్ చేసుకోవడంతోపాటు పాక్ గగనతల మార్గాల్లో మూడుంటిని మూసివేసింది.భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య 11 గగనతల మార్గాలుండగా వీటిలో మూడుంటిని పాక్ మూసివేసిందని ఎయిర్ ఇండియా వెల్లడించింది. కాశ్మీర్ రాష్ట్రంలో అమలులో ఉన్న ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత పాక్ ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై ఎయిర్ ఇండియా స్పందించింది. 'పాక్ ఎయిర్స్పేస్ను మూసివేసింది. తద్వార విమానాల మళ్లింపులకు మరో 12నిమిషాలు అదనంగా సమయం పడుతుంది' అని ఎయిర్ఇండియా అధికారులు పేర్కొన్నారు.