Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఘటనకు మాదే బాధ్యత : హౌతీ తిరుగుబాటుదారులు
రియాద్ : సౌదీలోని ఆభా అంతర్జాతీయ విమానాశ్రయంపై డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడిలో విమానాల కదలికలను పర్యవేక్షించే రాడార్ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైంది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తున్నట్టు హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించుకున్నారు. గతనెలలో ఆభా, నజ్రాన్ నగరాల్లోని ఎయిర్పోర్ట్స్పై హౌతీ తిరుగుబాటుదారులు డ్రోన్లు ప్రయోగించారు. గతనెల 3న ఆభా విమానాశ్రయంపై జరిగిన డ్రోన్ దాడిలో 9 మంది పౌరులు గాయపడ్డారు. ఈ దాడి జరిగిన కొన్ని గంటలకే ఖమిష్ ముసైత్ విమానాశ్రయంపై డ్రోన్ దాడి జరిగింది.కాగా, ఇరాన్ అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగింది. అంతేగాకుండా, మిత్రదేశాలను కూడా ఒప్పందం నుంచి బయటకు రావాలని అమెరికా ఒత్తిడి పెంచింది. ఇరాన్పై భారీ ఆంక్షలు మోపింది. ఇరాన్తో ద్వైపాక్షిక సంబంధాలను రద్దు చేసుకోవాలని ఇతర దేశాలపై ఒత్తిడి తెస్తోంది. దీంతో, పలు దేశాలు ఇరాన్తో వాణిజ్య సంబంధాలను రద్దు చేసుకున్నాయి. ఇరాన్పై సౌదీ, అమెరికా దేశాలు కక్షసాధింపు చర్యలకు పాల్పడటం పట్ల హౌతీ తిరుగుబాటుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సౌదీ విమానాశ్రయాలపై డ్రోన్లతో దాడులకు పాల్పడుతున్నారు.