Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదుగురి మృతి..23మంది గల్లంతు
ఖాట్మండ్: నేపాల్లోని ధడింగ్ జిల్లాలో ప్రమాదం సంభవించింది. త్రీశూలీ నదిలో ఓ బస్సు అదుపు తప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. 23 మంది గల్లంతయ్యారు. బస్సు నదిలో పడిపోయిన సమయంలో 50 మంది ప్రయాణికులున్నట్టు సమాచారం. సమాచారం అందుకున్న ప్రత్యేక బృందాలు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.... శుక్రవారం తెల్లవారుజామున బస్సు మలంగావ నుంచి ఖాట్మండ్కు వెళ్తుండగా ప్రమాదవశాత్తు బెనిఘాట్ రోరంగ్ మున్సిపాలిటీ-3 పరిధిలోని త్రిశూలీ నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా, మరో 16 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. కేసు నమోదు చేసుకొని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్టు స్థానిక డీఎస్పీ తెలిపారు.