Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: ఈ నెల 11 నుంచి 17 వరకు అమెరికా విదేశాంగ సహాయమంత్రి జాన్ సులెవన్ భారత్, భూటాన్ దేశాల్లో పర్యటించనున్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో కీలకంగా ఉన్న ఈ రెండు దేశాలతో అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఆయన పర్యటన కొనసాగనుంది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. భారత పర్యటన సందర్భంగా కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్తో సమావేశం కానున్నారు. భారత్-అమెరికా ఫోరమ్లో ప్రసంగించనున్నారు.