Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన అధికారులు
బీజింగ్ : చైనాలో లెకిమా తుఫాను సంభవించే ప్రమాదముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చైనా వాయువ్య దిశలో ఉన్న అన్ని ప్రావిన్స్ల్లోని అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. చైనా నేషనల్ మెటీరియోలజికల్ సెంటర్ వెల్లడించిన వివరాల ప్రకారం...తీర ప్రాంతం నుంచి 290కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. జెజియాంగ్ ప్రావిన్స్లో, షాంఘై ప్రాంతాల్లో శనివారం భారీ వర్షం కురిసింది. యాంగ్జే నది పొంగిపొర్లుతున్నది. వరదలు పోటెత్తే ప్రమాదముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఏడు ప్రావిన్స్ల్లో వరద ప్రభావం అధికంగా ఉండే ప్రమాదముందని అన్నారు. పలు ప్రాంతాల్లో ముందస్తుగా సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. చేపల వేట కోసం మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొదంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.