Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాశ్మీర్ అంశంపై స్పందించిన అమెరికా
వాషింగ్టన్: కాశ్మీర్ అంశంపై తమ విధానంలో ఎటువంటి మార్పు లేదని అగ్రరాజ్యం అమెరికా పునరుద్ఘాటించింది. ఇటీవల చోటుచేసుకున్న పరిణా మాలను దృష్టిలో ఉంచుకొని ఇరు దేశాలు సంయమనం పాటించాలని సూచించింది. కాశ్మీర్ అంశం పూర్తిగా భారత్-పాక్ ద్వైపాక్షిక అంశమని, దీనిపై తాము కలగజేసుకోలేమని వైట్హౌస్ అధికార ప్రతినిధి మోర్గాన్ ఓర్టగస్ తెలిపారు. ఇరు దేశాలు కాశ్మీర్ వివాదంపై శాంతియుత వాతావరణంలో చర్చలు జరుపుకోవాలని కోరారు. భారత్, పాక్ చర్చలు జరిపేందుకు మాత్రమే తాము మద్దతిస్తామని అన్నారు.
ఇరుదేశాలతో అమెరికాకు బలమైన సంబంధాలు ఉన్నాయని.. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఉభయ దేశాల్లో నెలకొన్న వాతావరణాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని అన్నారు.
కాశ్మీర్తో సంబంధం ఉన్న అన్ని భాగస్వామ్య పక్షాలు సంయమనం పాటించాలని కోరారు. కాశ్మీర్లో భారత్ మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతుందన్న ఇమ్రాన్ ఆరోపణలపై ఓర్టగస్ స్పందించడానికి ఇష్టపడకపోవడం గమనార్హం. వివాదాస్పద ప్రాంతాల్లో చట్ట ప్రకారం వెళ్లాలన్నదే తమ సూచన అని వ్యాఖ్యానించారు. అధికరణ 370 రద్దుకు సంబంధించి భారత్ తమకు ముందే సమాచారం అందించిందని అంతర్జాతీయ మీడియాల్లో వచ్చిన వార్తలను ఓర్టగన్ కొట్టిపారేశారు.