Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జెరూసలేం : గాజా-ఇజ్రాయిల్ మధ్య సరిహద్దు ప్రాంతంలో శనివారం ఉదయం నలుగురు పాలస్తీనీయులను ఇజ్రాయిల్ సైన్యం కాల్చి చంపింది. ఈ మేరకు సైన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. రైఫిల్స్, క్షిపణి నిరోధక ట్యాంకర్లు, హ్యాండ్ గ్రెనెడ్ వంటి భారీ ఆయుధాలు ఆ నలుగురి వద్ద ఉన్నాయని, వాటిలో ఒక దానిని ఇజ్రాయిల్ సైన్యపై విసిరారని ఆ ప్రకటన పేర్కొంది. వారిలో ఒకరు సరిహద్దును దాటి రావడంతో కాల్పులు ప్రారంభించినట్టు సైన్యం ఆ ప్రకటనలో వెల్లడించింది. ఈ కాల్పుల్లో ఇజ్రాయిల్ సైనికులకు ఏమీ కాలేదని తెలిపింది. అయితే దీనికి సంబంధించి గాజాలోని పాలస్తీనా అధికారుల నుంచి గాని, ఆ ప్రాంతంలోని సాయుధ బృందాల నుండి కాని ఎటువంటి స్పందన రాలేదు. పాలస్తీనాలోని ముస్లింలు ఈద్ అల్ అదాకు సన్నాహాలు చేసుకుంటున్న నేపధ్యంలో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి.