Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అరాఫత్ పర్వతానికి చేరుకున్న ముస్లింలు
రియాద్ : హజ్ యాత్ర శనివారానికి చరమాంకానికి చేరింది. దాదాపు 20 లక్షల మంది ముస్లింలు సౌదీ అరేబియాలోని అరాఫత్ పర్వతాలకు చేరుకున్నారు. ఇక్కడ ప్రార్థనలు జరిపారు. ఈ పర్వతంపై దాదాపు 1400 సంవత్సరాల క్రితం ప్రవక్త మహ్మద్ ముస్లింల నుద్దేశించి ప్రసంగించారు. ముస్లింల మధ్య ఐక్యత, సమానత్వాల కోసం పిలుపునిచ్చారు. హజ్లో రెండోరోజు యాత్ర ముస్లింలందరికి తీపి గుర్తుగా ఉండిపోతుంది. అంతకుముందు రోజు రాత్రల్లా మినా నగరంలో ఏర్పాటు చేసిన పెద్ద టెంట్లో ప్రార్థనలు జరిపి ఆయన కరుణ తమకు కావాలని కోరుకుంటారు.యాత్రికులందరూ తెల్లని దుస్తులు ధరిస్తారు. సామాజిక స్థితిగతులు, జాతీయతతో సంబంధం లేకుండా తామందరం ఒకటేనని చెప్పడానికి సంకేతంగా తెల్ల దుస్తులు ధరిస్తారు. పర్వతంపైన పగలంతా ప్రార్థనలు జరిపిన వారు సాయంత్రానికి మినా పట్టణానికి తిరిగి వచ్చి భూతం (సైతాన్)గా చెప్పబడే ఒక రాయిని రాళ్ళతో కొడతారు. దీని తరువాత జంతువులను బలి ఇస్తారు. అనంతరం నాలుగు రోజులపాటు జరుపుకునే ఈద్ అల్ అదా ప్రారంభమవుతుందనడానికి సంకేతంగా జంతువులను బలి ఇస్తారు.