Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇరాన్ చమురు నౌక నిర్బంధం నుంచి విముక్తి..
లండన్: జిబ్రాల్టర్లో నిర్బంధించిన ఇరాన్ చమురు ట్యాంకర్లో సిబ్బందిగా ఉన్న భారతీయులు గురువారం విడుదలయ్యారు. ఈ నౌక నిర్బంధం సక్రమమేనని అమెరికా న్యాయశాఖ చివరి నిమిషంలో తీర్పు వెలువరించినప్పటికీ జిబ్రాల్టర్ అధికారులు భారత నావికులను విడుదల చేయటం విశేషం. తమను విడుదల చేసిన అధికారులకు, ఇందుకు కృషి చేసిన న్యాయవాదుల బృందానికి భారత సంతతికి చెందిన ఈ నౌక కెప్టెన్ కృతజ్ఞతలు తెలిపారు. గత నెలలో స్పెయిన్ తీరంలోని బ్రిటిష్ ప్రాదేశిక జలాలలో జిబ్రాల్టర్ వద్ద పనాకా పతాకంతో వున్న ఈ నౌకను నిర్బంధంలోకి తీసుకున్నపుడు భారత సంతతికి చెందిన నౌక మాస్టర్, ఛీఫ్ ఆపరేటర్, ఇద్దరు సెకండ్ మేట్స్ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కెప్టెన్తో సహా నలుగురు క్రూ సిబ్బందిని విడుదల చేసినట్టు ఇరాన్ ప్రకటించింది. 42 రోజుల తర్వాత విడుదల కావటంతో..వారి కుటుంబసభ్యుల్లో ఆనందం వ్యక్తమవుతున్నది.