Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాస్కో: రష్యాలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఎయిర్బస్-ఏ321 విమానం మాస్కో శివారు ప్రాంతంలోని మొక్కజొన్న తోటలో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. విమానానికి పక్షుల గుంపు అడ్డురావడంతో సమయస్ఫూర్తితో వ్యవహరించిన పైలెట్ వెంటనే ల్యాండ్ చేశాడు. ఆ విమానంలో 226 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ఉన్నట్టు సమాచారం. విమానం అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యే క్రమంలో 23 మంది ప్రయాణీకులు గాయపడ్డారు. యురల్ ఎయిర్లైన్స్కు చెందిన విమానంగా దీన్ని గుర్తించారు. దీనిపై ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి స్పందించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, పైలట్ సమయస్ఫూర్తి వల్లే పెను ప్రమాదం తప్పిందని తెలిపారు. హుకోవ్స్కీ అంతర్జాతీయ విమానాశ్రయానికి కిలోమీటరు దూరంలో ఈఘటన చోటు చేసుకుంది. మాస్కోలోని జుకోవ్స్కీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి క్రిమియాలోని సిమ్ఫెరోపోల్కు ఎయిర్బస్-ఏ321 బయల్దేరిన కొద్ది సేపటికే అత్యవసరంగా ల్యాండ్ అయింది.