Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యూజెర్సీ ఎన్నికల ప్రచార ర్యాలీలో ట్రంప్
వాషింగ్టన్ : మతిస్థిమితం లేనివారి కారణంగానే తమ దేశంలో కాల్పుల ఘటనలు చోటు చేసుకుంటున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇటీవలి కాలంలో యూఎస్లో వరుస కాల్పుల ఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. వీటిపై ట్రంప్ స్పందించారు. న్యూజెర్సీ నగరంలో ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన మాట్లాడారు. 'నిజాయితీపరుల దగ్గర తుపాకులుంటే మాకు ఎలాంటి సమస్య తతెత్తే అవకాశం లేదు. వారికి నేను మద్దతిస్తాను. కానీ మానసిక స్థితి సరిగా లేని వాళ్లు మాత్రమే ఇలాంటి కాల్పులకు తెగబడతారు. అందుకే వారందరి కోసం అమెరికాలో మరిన్ని విద్యాసంస్థలు ఏర్పాటు చేస్తాం. ఈ మేరకు నేను అధికారులతో మాట్లాడాను. మతిస్థిమితం లేని వారి వద్ద తుపాకులు, మారణాయుధాలు ఉండటం చాలా ప్రమాదకరం. ఈ ఘటనలను మేం తీవ్రంగా పరిగణిస్తున్నాం. అమెరికాలో శృతిమించుతున్న తుపాకీ సంస్కృతిని గమనిస్తున్నాం.
1960-70 మధ్య కాలంలో అమెరికాలోని పలు మానసిక విద్యాసంస్థలు మూత పడ్డాయి. దీని ప్రభావం తాజాగా కనబడుతున్నది. ఆయా సంస్థలు మూతపడటంతోనే మతిస్థి మితం లేని వారు వీధుల్లోకి చేరుకొని మారణహౌమాలు సృష్టిస్తు న్నారు' అని ట్రంప్ అన్నారు. ఇది లా ఉండగా, అమెరికాలో వారం వ్యవధిలో రెండు సార్లు కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. గతనెల 31న విస్కాన్సిన్ రాష్ట్రంలో జరిగిన రెండు ఘట నల్లో నలుగురు బలయ్యారు. వీరితోపాటు కాల్పులకు తెగబడ్డ నింది తుడు కూడా విగతజీవుడై కనిపించాడు. ఈనెల4న టెక్సాస్ రాష్ట్రంలోని ఎల్పా సోలో ఉన్న వాల్మార్ట్ స్టోర్లో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల ఘట నలో 20 మంది మృతి చెందగా, మరో 40 మంది గాయపడ్డారు.