Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదృశ్యమైన ఐర్లండ్ బాలిక మృతిపై మలేషియా పోలీసులు
సిరంబన్ : సెలవుల్లో సరదాగా గడిపేందుకు తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి అదృశ్యమైన ఫ్రాన్స్ - ఐరిష్ బాలిక నోరా క్యుయిరన్ (15) ఆకలి బాధతో మర్మావయవాలలో తీవ్ర రక్తస్రావంతో మరణించినట్టు శవ పరీక్షలో నిర్థారణ అయిందని ఐర్లండ్ పోలీసులు తెలిపారు. లండన్కు చెందిన ఆ కుటుంబం సెలవుల్లో విహార యాత్రకు ఇక్కడకు వచ్చిందని వారు పేర్కొన్నారు. ఆ బాలిక కిడ్నాప్కు గురి అయిందని, ఆమెపై లైంగిక దాడి జరిగిందన్న వార్తలు అవాస్తమన్నారు. కౌలాలంపూర్ సమీపంలోని డస్సన్ రిసార్ట్ నుండి ఈ నెల 4న బాలిక అదృశ్యమైంది. నోరా క్యుయోరిన్పై ఎలాంటి అఘాయిత్యం జరగలేదని చెప్పేందుకు పోలీసులు తొందరపడుతున్నారని ఆమె కుటుంబం తరుపు న్యాయవాది ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆ బాలికను అపహరించి, అత్యాచారానికి పాల్పడి ఉంటారని ఆమె కుటుంబం పేర్కొంది. దాదాపు పది రోజులపాటు వందలాది మంది గ్రామస్తులు, హెలికాప్టర్లు, జాగిలాలు గాలించగా ఆమె మృతదేహం దట్టమైన అడవిలోని ఒక లోయలాంటి ప్రాంతంలో లభించింది. తమ కుమార్తె మృతిపై పలు సందేహాలున్నాయని, వాటన్నిటికి సమాధానాలు దొరుకుతాయనే ఆశిస్తున్నామని ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు తెలిపారు. రెండు, మూడు రోజులు ముందే ఆ బాలిక మరణించి ఉంటుందని పోలీసులు తెలిపారు. ఆమె మృతదేహాన్ని తమకు అప్పగించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆ కుటుంబానికి చెందిన ఫ్రెంచ్న్యాయవాది చార్లెస్ మోరెల్ మాట్లాడుతూ ఈ దశలో ఆమెపై ఎటువంటి అఘాయిత్యం జరగలేదని కుటుంబ సభ్యులకు చెప్పడం తొందరపాటేనన్నారు.