Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢాకా: బంగ్లాదేశ్లో కార్చిచ్చు చెలరేగింది. మంటల్లో చిక్కుకొని పలువురు గాయపడ్డారు. వందలాది ఇండ్లు అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో, దాదాపు 2వేల మంది నిరాశ్రయులయ్యారు. మంటలు దావానలంలా వ్యాపిస్తున్నాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను ఆర్పేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని జిల్లా ఎస్పీ గోలం రబ్బానీ తెలిపారు. మిర్పూర్ ప్రావిన్స్లో మంటలు చెరాగాయని అన్నారు.ఇండ్లల్లో నివసిస్తున్న ప్రజలంతా బక్రీదు పండుగ జరుపుకోవడానికి వెళ్లడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. కార్చిచ్చు చెలరేగడానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్టు రబ్బానీ తెలిపారు.