Authorization
Mon Jan 19, 2015 06:51 pm
థింపు (భూటాన్) : అద్భుతాలు సృష్టించే శక్తి, సామర్థ్యాలు భూటాన్ దేశ యువతకు ఉందని, తద్వారా వారు ఆ దేశ భవిష్యత్తును మార్చగలరని ప్రధాని మోడీ ప్రశంసించారు. భూటాన్లో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం ఆయన రాజధాని థింపు లోని రాయల్ యూనివర్సిటీ ఆఫ్ భూటాన్ విద్యార్థులతో ముచ్చటిం చారు. కష్టించి పనిచేసి హిమాలయ దేశాన్ని ఉన్నతస్థాయికి తీసుకెళ్లాలని వారికి సూచించారు. ఇంతకు ముందు కన్నా ప్రస్తుతం యువతకు ఈ ప్రపంచం ఎన్నో అవకాశాలు కల్పిస్తోందని, వాటిని అందిపుచ్చుకొని అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కష్టించి పనిచేస్తే అది భవిష్యత్తు తరాలకు ఉపయోగపడుతుందని తెలిపారు. ఏ సమస్యకైనా పరిష్కారం చూపగల శక్తి ప్రస్తుత యువత మెదడుకు ఉందని, దాన్ని సరైన రీతితో వినియోగించుకోవాలని అన్నారు.