Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : లూసియానా మాజీ గవర్నర్ కత్లీన్ బాబినియాక్స్ బ్లాంకో (76) మృతిచెందారు. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆమె స్థానిక ఆస్పత్రిలో తుది శ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు, సన్నిహితులు తెలిపారు. ఆమె మృతి పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యూఎస్ మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్, లూసియానా ప్రస్తుత గవర్నర్ జాన్ బెల్ బెర్నార్డ్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. బ్లాంకో కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా, 2004లో బ్లాంకో డెమోక్రటిక్ పార్టీ తరుఫున పోటీ చేసి ఎన్నికల్లో గెలుపొందారు. లూసియానా తొలి మహిళా గవర్నర్గా నియమితులయ్యారు. ఆమె పదవీ కాలంలో అమెరికాను కత్రినా తుఫాను ముంచెత్తింది. ఈ ప్రకృతి విపత్తు కారణంగా 1800 మంది మృతిచెందారు. వందలాది మంది గాయపడ్డారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. అయితే, తుఫాను సంభవించిన సమయంలో సరైన సహాయక చర్యలు చేపట్టలేదనే విమర్శలు ఎదుర్కొన్నారు. తుఫాను బాధితులకు పునరావాసం కల్పించడంలో విఫలయ్యారని సొంత పార్టీ నేతలు కూడా ఆమెను విమర్శించారు. 2008 వరకు గవర్నర్ పదవిలో కొనసాగి వైదొలిగారు. బ్లాంకోకు భర్త, ఐదుగురు సంతానం ఉన్నారు.