Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూయార్క్ : కాబూల్ నగరంలో ఓ పెండ్లి వేడుక లక్ష్యంగా ఐఎస్ జరిపిన ఆత్మాహుతి దాడిని ఐక్యరాజ్యసమితి ఖండించింది. పౌర మరణాలపై ఐరాస ప్రధాన కార్యదర్శి జాన్ గుటేరస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులంతా త్వరలో కోలుకోవాలని ఆకాంక్షించారు. అఫ్ఘాన్లో పేలుడు ఘటనలు పునరావృతం కాకుండా అష్రఫ్ ఘనీ సర్కారు పటిష్ట చర్యలు చేపట్టాలని సూచించారు. కాబూల్ నగరంలో ఈనెల18న జరిగిన ఆత్మాహుతి దాడిలో 63 మంది మృతి చెందగా, 200 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడికి తామే బాధ్యత వహిస్తున్నట్టు ఐఎస్ ప్రకటించుకుంది.