Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆత్మాహుతి దాడితో భీతిల్లిన అఫ్ఘాన్ పౌరులు
కాబూల్ : అఫ్ఘనిస్థాన్ ఆవిర్భవించి 100ఏండ్లు పూర్తయింది. ఈ సందర్భంగా శతాబ్ధి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని భావించిన అఫ్ఘాన్ సర్కారు ఆశలు అడియాసలయ్యాయయి. కాబూల్ నగరంలోని పెండ్లి వేడుకను లక్ష్యంగా చేసుకొని ఐఎస్ విసిరిన పంజాతో దేశ ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
ఈ ఘటనలో 63 మంది మృతి చెందగా, 200 మందికి పైగా మృతి చెందారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఇలాంటి తరుణంలో సోమవారం నిర్వహిం చనున్న శతాబ్ధి ఉత్సవాలను ప్రభుత్వ రద్దు చేసింది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు దేశ ప్రజలంతా దూరంగా ఉన్నారు. మృతులకు నివాళులు అర్పించారు. మృతుల కుటుంబాలకు దేశ ప్రజలంతా ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా, ఈఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించాలని అఫ్ఘాన్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. చరిత్ర పుటల్లో ఆగస్టు19 చిరస్థాయిలో నిలిచిపోయేలా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించాలని యోచించింది. అంతేగాకుండా, 18ఏండ్ల నుంచి భద్రతా బలగాలకు, తాలిబన్లకు మధ్య కొనసాగుతున్న అంతర్యుద్ధాన్ని నిర్మూలించాలని భావించింది. ఓ మెట్టు దిగి వచ్చింది. దోహా నగరంలో తాలిబన్ ప్రతినిధులతో అఫ్ఘాన్ ప్రతినిధులు భేటీ అయ్యారు. తాలిబన్ల పలు డిమాండ్లకు ఇప్పటికే ప్రభుత్వం అంగీకరించింది.
అఫ్ఘాన్లో రక్తపాతాన్ని నిర్మూలించి శాంతియుత వాతావరణం నెలకొల్పాలని అష్రఫ్ ఘనీ సర్కార్ భావించింది. శతాబ్ధి ఉత్సవాల నిర్వహణ కోసం నాలుగు వారాల నుంచి సైనికులు సన్నాహాక విన్యాసాలు ప్రదర్శిస్తున్నారు. కింగ్ అమానుల్లా ఖాన్ బిల్బోర్డులు, విద్యుత్ కాంతులు వెదజెల్లే రంగు రంగుల వీధి దీపాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. స్వాతంత్య్ర సముపార్జన కోసం కృషి చేసిన మహనీయుల ఫొటోలను గోడలపై పెయింటింగ్ చేయించింది. విద్యార్థులతో ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించాలని భావించింది. ఐఎస్ దాడిలో మృతి చెందినవారి సంతాప సూచకంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను బహిష్కరించింది.