Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హాంగ్కాంగ్: హాంగ్కాంగ్ నగరంలో చైనాకు మద్దతుగా మెజారిటీ పౌరులు ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైనా ప్రభుత్వ మద్దతుదారులు పాల్గొన్నారు. వాన్కౌవెర్స్ నగరంలోని చైనా దౌత్యకార్యా లయం సమీపంలో మద్దతుదారులు సమావేశమయ్యారు. హాంగ్కాంగ్ను చైనాలో అంతర్భాగంగా గుర్తించాలనే ప్రతిపాదనకే తాము మద్దతిస్తున్నా మంటూ నినదించారు. హాంగ్కాంగ్ను చైనాను వేరే చేయాలనే ప్రతిపా దనకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. కాగా, హాంగ్కాంగ్లో నేరారోపణలు ఎదుర్కొంటున్న నిందితులను చైనాకు పంపించి అక్కడి న్యాయస్థానాల్లో విచారించాలని యోచిస్తున్నట్టు హాంగ్కాంగ్ చీఫ్ క్యారీ లామ్ ప్రకటించారు. ఈ మేరకు ఓ బిల్లును ప్రతిపాదించగా దీనిపై భిన్నా భిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఓవర్గానికి చెందిన ప్రజలు హాంగ్కాంగ్లో నేరారోపణలు ఎదుర్కొంటున్నవారిని ఎట్టిపరిస్థితుల్లో చైనాకు పంపించేం దుకు అంగీకరించబోమన్నారు. తద్వారా హాంగ్కాంగ్ న్యాయవ్యవస్థ మస కబారే ప్రమాదముందని అన్నారు. మెజారిటీ పౌరులు మాత్రం కేసుల దర్యాప్తు పారదర్శకంగా కొనసాగాలని, నేరస్థులకు కఠిన శిక్షలు పడాలం టే కేసుల విచారణ చైనాలోనే కొనసాగాలని పేర్కొన్నారు. ఈనేపథ్యంలో హాంగ్కాంగ్లో ఇరుగ్రూపులమధ్య ఘర్షణ వాతావరణంనెలకొంది. దీంతో ఈబిల్లును తాత్కాలికంగా రద్దు చేసినట్టు క్యారీ లామ్ వెల్లడించారు. అయితే, ఈబిల్లును పూర్తిగా రద్దు చేయాలంటూ మరోసారి నిరస నలు వ్యక్తమయ్యాయి. దీంతో, ప్రో-హాంకాంగ్, ప్రో-చైనా అంటూ రెండు వర్గా లు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. ప్రో-హాంగ్కాంగ్ వర్గం చైనా నుంచి హాంగ్కాంగ్ను విడదీయాలని డిమాండ్ చేస్తుండగా, హాంగ్కాంగ్ ను చైనాలోనే కొనసాగించాలని ప్రో-చైనా వర్గం డిమాండ్ చేస్తోంది.