Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్: 'నోడీల్ బ్రెగ్జిట్తో అన్నింటికీ కరువే'నంటూ హెచ్చరించిన రహస్య పత్రం లీకయిన నేపథ్యంలో ఈ పత్రంపై చర్చించేందుకు పార్లమెంట్ను వెంటనే సమావేశ పర్చాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్పై ఒత్తిడి పెరుగుతోంది. ఈ పత్రంలో హెచ్చరించిన అంశాలు దీర్ఘకాలంలో వాస్తవమౌతాయని ఆర్థిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తుండగా బ్రెగ్జిట్ మద్దతుదారులు మాత్రం ఈ హెచ్చరికలన్నీ ఉన్మాదపు రాతలంటూ కొట్టిపారేస్తున్నారు. బ్రెగ్జిట్ సంక్షోభంపై చర్చించేందుకు పార్లమెంట్ను వెంటనే సమావేశ పర్చాలని డిమాండ్ చేస్తూ దాదాపు 100 మందికి పైగా ఎంపీలు సంతకాలు చేసిన డిమాండ్ పత్రాన్ని తాము కూడా సమర్ధిస్తున్నట్టు ప్రతిపక్ష లేబర్ పార్టీ ప్రతినిధి జాన్ మెక్డానెల్ చెప్పారు.