Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : కాశ్మీర్లో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని, వాటిని సాధారణ స్థితికి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.
ఈ నేపథ్యంలో మోడీ, ఇమ్రాన్ఖాన్లతో మాట్లాడినట్టు ట్రంప్ పేర్కొన్నారు. ఈ మేరకు...' నా ఇద్దరు మంచి స్నేహితులు భారత ప్రధాని నరేంద్ర మోడీ, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్లతో వాణిజ్యం, వ్యూహాత్మక భాగస్వామ్యాలు.. అన్నింటికీ మించి ప్రస్తుతం కాశ్మీర్లో ఉద్రికత్తలను తొలగించాల్సిన ఆవశ్యకత గురించి మాట్లాడాను. ఎంతో కఠినమైన పరిస్థితులు.. అయితే చక్కటి సంభాషణ కొనసాగింది' అని ట్రంప్ ట్వీట్ చేశారు