Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంకారా : ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండా ఆశ్రయం పొందుతున్న సిరి యా వలసదారులంతా వెనక్కి వెళ్లిపోవాలని టర్కీ పేర్కొంది. ఈఏడాది అక్టోబర్ 30లోపు తమ దేశాన్ని విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు టర్కీ అంతర్గత వ్యవహారాల మంత్రి సులేమాన్ సోయ్లూ మంగళవారం ఓ ప్రకటన జారీ చేశారు. అయితే, టర్కీలో చదువుకుంటున్న సిరియా విద్యార్థులకు మాత్రం తమ ఆదేశాల నుంచి మినహాయింపు ఇచ్చామని అన్నారు. కాగా, సిరియాలో 2011 నుంచి అంతర్యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. భద్రతా బలగాలకు, మిలిటెంట్ గ్రూపులకు మధ్య జరుగుతున్న పోరులో 4లక్షల మంది మృతి చెందగా, లక్షలాది మంది ప్రాణభయంతో ఇతర ప్రాంతాలకు వలసవెళ్లారు. టర్కీలో 5.4లక్షల మంది సిరియా వలసదారులు ఆశ్రమం పొందుతున్నారు. వీరిలో సగం మందికి పైగా అక్రమ వలసదారులున్నారని టర్కీ ఆరోపిస్తున్నది.