Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరోసారి ట్రంప్ వ్యాఖ్యలు
వాషింగ్టన్: కాశ్మీర్ అంశంపై మధ్యవర్తిత్వం వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వ్యాఖ్యానించారు. గతంలోనూ ఇదే విధమైన వ్యాఖ్యలు చేసి యూటర్న్ తీసుకున్నారు ట్రంప్. భారత్, పాక్ దేశాలు ద్వైపాక్షిక చర్చల ద్వారా కాశ్మీర్అంశాన్ని పరిష్కరించుకోవాలని అన్నారు. ఒకవేళ మధ్యవర్తిత్వం వహించే అవకాశం వచ్చి నట్టయితే తాను సిద్ధంగా ఉంటానని మాట మా ర్చారు. తాజాగా, ట్రంప్ మరోసారి అదే ప్రక టన చేశారు. కాశ్మీర్ అంశం చాలా తీవ్రమైనదని ఆయన వ్యాఖ్యానించారు. 'కాశ్మీర్ ప్రాంతం చాలా సంక్లిష్టమైనది. భారత్లోని రెండు కీలక వర్గాలు సం యమనంతో ఉన్నాయని నేను చెప్పలేను. రెండు దేశాలు చాలా కాలంగా కలసికట్టుగా ముందుకు సాగడం లేదనే విషయాన్ని నేను స్పష్టంగా చెప్పగలను. నేను మధ్యవర్తిత్వం వహిస్తే వీలైనంతగా సమస్యను పరిష్కరిస్తా.' అని ట్రంప్ అన్నారు. పరిస్థితిని తాము మెరుగుపరచగల మని తాను భావిస్తున్నానని ట్రంప్ చెప్పారు. అయితే, ఇరు దేశాల మధ్య ఎన్నో క్లిష్టమైన సమస్యలు ఉన్నాయని ఇది అందరికీ తెలిసిన విషయమేనని అన్నారు. ఇరు దేశాల్లో మతం అనేది చాలా క్లిష్టమైన సమస్య అని చెప్పారు. మతం విషయంలో చేయాల్సింది చాలా ఉందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.