Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అనురాగ్ సింఘాల్ను నామినేట్ చేసిన ట్రంప్ సర్కార్
వాషింగ్టన్ : భారత సంతతి అమెరికన్ అనురాగ్ సింఘాల్ను ఫ్లోరిడా రాష్ట్రంలో జిల్లా ఫెడరల్ జడ్జి పదవికి అధ్యక్షుడు ట్రంప్ నామినేట్ చేశారు. ఫ్లోరిడా దక్షిణ జిల్లా కోర్టు న్యాయమూర్తిగా ఆయన్ని ట్రంప్ సర్కార్ ప్రతిపాదించింది. ఈ రాష్ట్రంలో ఒక భారత సంతతి వ్యక్తిని ఈ పదవికి నామినేట్ చేయటం ఇదే తొలిసారి. ఇంతకుముందు కాలిఫోర్నియా రాష్ట్రంలో ఇలాగే భారత సంతతి మహిళ షిరీన్ మాథ్యూస్ను ఫెడరల్ జిల్లా కోర్టు న్యాయమూర్తిగా అధ్యక్షుడు ట్రంప్ నామినేట్ చేశారు.
నియామకంపైనా సెనెట్ ఆమోదం తెలపాల్సి ఉంది. అనురాగ్ సింఘాల్ ప్రస్తుతం ఫ్లోరిడాలోనే 'సర్క్యూట్ కోర్టు' జడ్జిగా 2011నుంచి పనిచేస్తున్నారు. దీనికంటే ముందు ఆయన క్రిమినల్ కేసులకు సంబంధించి ట్రయల్ కోర్టులో డిఫెన్స్ లాయర్గా ప్రయివేటు ప్రాక్టీస్ చేశారు. 17 మందితో కూడిన న్యాయ నియామకాల జాబితాను శ్వేతసౌధం తాజాగా సెనెట్ అనుమతి కోసం పంపింది. వీటిపై సెనెట్ ఆమోదం తెలుపగానే, అనురాగ్ సింఘాల్ ఫెడరల్ జడ్జిగా నియమితులవుతారు. 'సెనెట్ జ్యుడీషియరీ కమిటీ' బుధవారం సమావేశమై న్యాయ నియామకాలపై ప్రకటన చేయనున్నది. అనురాగ్ సింఘాల్ 'రైస్ విశ్వవిద్యాలయం' నుంచి బీ.ఏ పట్టా, 'వేక్ ఫారెస్ట్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లా' నుంచి డాక్టర్ డిగ్రీ పొందారు.