Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశమంతా వలసదారులతో మునిగిపోతుంది: ట్రంప్
వాషింగ్టన్: 'డెమోక్రాట్లకు అధికారమిస్తే దేశమంతా వలసదారులతో మునిగిపోతుంది. అహింసా, నేరాలు తీవ్రంగా పెరిగిపోతాయి. ప్రజలు పేదరికంలో కూరుకుపోతారు' అని అమెరికా అధ్యక్షుడు డోనాల్ ట్రంప్ అన్నారు. 2020లో జరగనున్న దేశాధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించడానికి అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రచారం ప్రారంభించారు. ఇందులో భాగంగా నార్త్ కరోలినాలో జరగనున్న ప్రత్యేక ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా సోమవారం ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికాను ద్వేషించే వారికి.. రిపబ్లికన్ అభ్యర్థి డాన్ బిషప్ గెలుపుతో సమాధానం చెప్పాలని అన్నారు. అమెరికా మరింత బలమైన ఆర్థిక శక్తిగా ఎదగాలంటే తనకు మరో నాలుగేండ్ల సమయం ఇవ్వాలని కోరారు. దేశంలో ఇప్పుడే బలమైన ఆర్థికశక్తి అనే విత్తనం నాటామని, అది మొక్కగా పరిణితి చెంది, దాని మూలాలను పెంచుకోవాలని తెలిపారు. అలా జరగాలంటే 2020లోనూ తమకే అధికారం కట్టబెట్టాలన్నారు. లేదంటే దాన్ని పీకేస్తారని వెల్లడించారు.
ఆస్తుల వివరాలు ప్రకటిస్తా: ట్రంప్
2020లో జరగనున్న దేశాధ్యక్ష ఎన్నికలకు ముందు తన ఫైనాన్సియల్ రిపోర్ట్ను వెల్లడించను న్నట్టు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. వైట్హౌస్లో మీడి యాలో మాట్లాడుతూ.. జరగబోయే అధ్యక్ష ఎన్నికలకు ముందు తన పూర్తిస్థాయి ఆర్థిక నివేదికను ఇవ్వను న్నట్టు తెలిపారు. తమ కుటుంబానికి చెందిన ఆస్తులపై ప్రభుత్వం అధిక స్థాయిలో ఖర్చులు చేస్తున్నదని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఐర్లాండ్లో ఉన్న ట్రంప్ భవనంలో అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ బస చేశారు. దీంతో ట్రంప్ ఆస్తులపై మరోసారి ఆరోపణలు గుప్పుమంటున్నాయి. 2020 నవంబర్లో జరిగే ఎన్నికలకు ముందు ఆస్తుల వివరాలను వెల్లడిస్తానని, ఆ విషయాలు మిమ్మల్ని షాక్కు గురి చేస్తాయని ట్రంప్ తెలిపారు. ప్రతి ఏడాది ఎంత పన్నుకడుతున్నారన్న దానిపై ఇప్పటి వరకు ట్రంప్ ఎటువంటి వివరణ ఇవ్వలేదు.