Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధ్యక్ష ఎన్నికల బరిలో 24 మంది అభ్యర్థులు
ట్యునీస్ : ట్యునీషియాలో ఆదివారం జరిగిన అధ్యక్ష ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్టు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. బ్యాలట్ విధానంలో ఎన్నికలు నిర్వహించామని అన్నారు. అధ్యక్ష పీఠం కోసం 24 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారని అన్నారు. 70లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. కాగా, ట్యునీషియాకు దీర్ఘకాలం సేవలందించిన జైన్ఎల్ ఆబిదైన్ అలీ 2011లో పదవీచ్యుతడయ్యారు. అనంతరం 2014లో దేశాధ్యక్షుడిగా బెజీ సైడ్ ఎస్సెబ్సీ బాధ్యతలు చేపట్టారు. ఈఏడాది జులైలో ఆయన మృతి చెందారు. దీంతో, ఆయన స్థానం ఖాళీ అయింది. ఈనేపథ్యంలో ఎన్నికల సంఘం అధ్యక్ష ఎన్నికలు నిర్వహించింది. ఈ ఎన్నికల్లో 50శాతానికి పైగా ఓట్లు పొందిన అభ్యర్థిని అధ్యక్షుడిగా ప్రకటిస్తారు. ఒకవేళ ఏ అభ్యర్థికి కూడా 50 శాతం ఓట్లు రాకున్నట్టయితే...అధిక ఓట్లు పొందిన ఇద్దరు అభ్యర్థుల మధ్య రీపోలింగ్ నిర్వహిస్తామని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఈఎన్నికల్లో పోటీ చేసిన వారిలో ప్రధాని యూసఫ్ చాహెద్, ప్రముఖ జర్నలిస్ట్ నబీల్ కరౌవీ, ఇన్హాదా పార్టీ నేత అబ్దెల్ ఫతాV్ామౌరౌ, ఫ్రీడెస్టోరియన్ పార్టీ నాయకురాలు అబిర్ మౌసీ, ఇండిపెండెంట్ అభ్యర్థి అబ్దెల్ కరీమ్ బిదీ, అల్ఇర్దా పార్టీ నేత మాన్సెఫ్ ఉన్నట్టు అధికారులు తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్టు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. ఎన్నికల నిర్వాహణ కోసం 70వేల మంది బలగాలు మోహరించాయని అన్నారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని వెల్లడించారు.