Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పశ్చిమ ఆఫ్రికా దేశాల ఆర్థిక సదస్సులో నేతలు
- రూ.7,103 కోట్లు ఖర్చు చేయనున్నట్టు ఉమ్మడి ప్రకటన
బుర్కినా ఫాసో : ఉగ్రవాదాన్ని నిర్మూలించనున్నట్టు పశ్చిమ ఆఫ్రికా దేశాల ఆర్థిక సదస్సులో నేతలు ఉద్ఘాటించారు. మిలిటెంట్ల నిర్మూలన కోసం 1బిలియన్ డాలర్ల ( రూ.7,103 కోట్లు ) నిధులు ఖర్చుచేయనున్నట్టు ఉమ్మడి ప్రకటన చేశారు. పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో ఉగ్రవాదుల హింసాత్మక దాడులను ధీటుగా ఎదుర్కొంటామని అన్నారు. భద్రతా బలగాలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. బుర్కినా ఫాసో నగరంలో పశ్చిమ దేశాల ఆర్థిక సదస్సు ఆదివారం జరిగింది. ఈ సదస్సులో సాలెV్ా రీజియన్లో చోటుచేసుకుంటున్న ఉగ్రవాదుల దాడుల నిర్మూలన అంశంపై నేతలు సుదీర్ఘ మంతనాలు జరిపారు. మిలిటెంట్ల నిర్మూలన కోసం 1బిలియన్ డాలర్ల ( రూ.7,103 కోట్లు) నిధులు అవసరమని నైజీరియా అధ్యక్షుడు మహ్మదౌ ఇసౌఫూ లేవనెత్తిన ప్రతిపాదనకు సభ్యదేశాల నేతలు అంగీకరించారు. ఉగ్రవాదుల నిర్మూల కోసం పశ్చిమ ఆఫ్రికా దేశాలు పరస్పర సైనిక సహకారం తీసుకోవాలని ఆయన కోరారు. అంతేగాకుండా, సైనికులకు మెరుగైన శిక్షణ అవసరమైన అభిప్రాయపడ్డారు. పశ్చిమ ఆఫ్రికా దేశస్థుల కంటిపై కునుకులేకుండా చేస్తున్న ఐఎస్, అల్ఖైదా మిలిటెంట్ల అణచివేతకు ఉమ్మడి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. వచ్చేఏడాది జనవరి నుంచి మాలి, బుర్కినో ఫాసోలో మిలిటెంట్ల ఏరివేత ఆపరేషన్ ప్రారంభించి క్రమక్రమంగా నైజర్, ఛాడ్, మౌరిటేనియాకు విస్తరిస్తామని అన్నారు. మాలిలో హక్కుల ఉల్లంఘన ఘటనలు పెరిగిపోవడం పట్ల పశ్చిమ ఆఫ్రికా దేశాల ఆర్థిక సందస్సు ప్రెసిడెంట్ జీన్ క్లాడ్ బ్రౌ ఆందోళన వ్యక్తం చేశారు. గత నాలుగేండ్లలో 2,200 దాడులు జరిగాయని, ఈ దాడుల్లో 11,500 మంది మృతిచెందారని అన్నారు. పశ్చిమ ఆఫ్రికా దేశాల్లోనూ వరుస ఉగ్రదాడుల ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో ప్రజలు వలసబాట పట్టాల్సిన దుస్థితి నెలకొందన్నారు. పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో ఉగ్రదాడుల నిర్మూలన కోసం ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ సహకారం తీసుకోవాలని ఐవోరీ కోస్ట్ అధ్యక్షుడు అలసానే ఔట్టారా అభిప్రాయపడ్డారు. ఆఫ్రికా దేశాలకు ఐరాస సభ్యదేశాలు సహకరించాలని యూఎన్ ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటేరస్ పిలుపునిచ్చిన విషయాన్ని ఔట్టారా ఈ సందర్భంగా గుర్తు చేశారు.