Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 30 మంది సజీవ దహనం
మాన్రోవియా : లిబియాలోని ఓ ఇస్లామిక్ పాఠశాలలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఉపాధ్యాయులతో పాటు 30 మంది సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీస్ అధికార ప్రతినిధి మాసెస్ కార్టర్ తెలిపిన వివరాల ప్రకారం... మాన్రోవియా నగరంలోని ఇస్లామిక్ పాఠశాలలో చిన్నారులు ఖురాన్ పఠనంలో నిమగమైన సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తరగతి గది నుంచి బయటకు వెళ్లేందుకు చిన్నారులు విఫలయత్నం చేశారు. ఈ ప్రమాదంలో 30 మంది మృతి చెందారు. షార్టు సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైందని కార్టర్ తెలిపారు. ఈ ఘటనపై లిబియా అధ్యక్షుడు జార్జ్వె తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.