Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.2గా నమోదు
జకార్తా: ఇండోనేషియాలో రెండు వేర్వేరు చోట్ల భూకంపం సంభవించింది. రిక్టర్స్కేల్పై వీటిపై తీవ్రత 6.2గా నమోదైందని యూఎస్ జియోలజికల్ సర్వే అధికారులు తెలిపారు. ప్రాణ, ఆస్తినష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. కేవలం గంట వ్యవధిలోనే బాలీ, జావా ద్వీపాలపై రెండు భూకంపాలు సంభవించాయి. ఈ భూకంపం తీవ్రతకు రెండు నగరాల్లోని పలు భవనాలు కంపించాయి. దీంతో, ప్రజలు ప్రాణభయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. పుర్వడోయి ప్రాంతానికి ఈశాన్య భాగంలో 148 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమై ఉన్నట్టు ఇండోనేషియా విపత్తు నిర్వహణ విభాగం ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
ఇండోనేషియా జనాభా 260 మిలియన్లు. ఇక్కడ తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. భూకంపాలు సర్వసాధారణం. అంతేగాకుండా, భారీ అగ్నిపర్వతాలు కూడా తరుచూ విస్ఫోటనం చెందడం కారణంగా పొంగిపొర్లే లావా, పొగ సమీపప్రాంతాలను చుట్టుముట్టుతుండటం సాధారణంగా కనిపిస్తాయి. ఇక ఈ భూకంపాలు, అగ్నిపర్వతాల విస్ఫోటనంకు కారణం ఆ ప్రాంతం పసిఫిక్ తీరంలో ఉండటమే. దీనిని 'పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ 'గా పిలుస్తారు. ఈ ఏడాది మార్చిలో జావా ద్వీపంలో సంభవించిన భూకంపంలో నలుగురు మృతి చెందారు. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.8గా నమోదైంది. 200కు పైగా ఇండ్లు ధ్వంసమయ్యాయి.