Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెల్కమ్ కాదు.. గోబ్యాక్ మోడీ
- యూఎస్లో ప్రోగ్రామ్ను తిరస్కరించాలి : రచయిత పీటర్ ఫ్రిడ్రిష్
టెక్సాస్ : ఆదివారం అమెరికాలోని హౌస్టన్ సిటీలో జరగనున్న హౌడీ మోడీ కార్యక్రమాన్ని తిరస్కరించాలని చారిత్రక విషయాల విశ్లేషణ, దక్షిణాసియా వర్తమాన రాజకీయాలపై పనిచేస్తున్న ప్రముఖ రచయిత పీటర్ ఫ్రిడ్రిష్ అన్నారు. హౌస్టన్ సిటీ కౌన్సిల్ గోబ్యాక్ మోడీ, స్టాండ్ విత్ కాశ్మీర్లాంటి నినాదాలతో మారుమోగింది. హౌడీ మోడీ కార్యక్రమంలో భాగంగా నిర్వహించే ర్యాలీలో నగర ప్రజలు పాల్గొనడంపై మరోసారి ఆలోచించుకోవాలని హౌస్టన్ సిటీ కౌన్సిల్ మాట్లాడుతూ ఆయన సూచించారు. 'గత నెల టెక్సాస్లోని ఎల్ పాసినోలో శ్వేత జాతి దురహంకార తీవ్రవాది జరిపిన కాల్పుల్లో 22 మంది మృతి చెందారు. ఆ ఘటనకు ప్రేరణ న్యూజీలాండ్లో 51మందిని పొట్టనబెట్టుకున్న క్రిస్ట్చర్చ్ మారణకాండ. ఆ ఉగ్రవాదికి ప్రేరణ 2011లో నార్వేలో 77మంది హత్యగావిం చిన దుర్మార్గపు ఘటన. నార్వేలో టెర్రరిస్టు అండర్స్ బ్రెవిక్ విడిచిపెట్టిన ఓ లేఖలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర ఉగ్రవాదులు, 'జాతీయవాద' సంస్థలతో తాను ఎలా ప్రేరణ పొందాడో వివరించాడు. భారత్లోని ఆరెస్సెస్నూ బ్రేవిక్ పేర్కొన్నా డు. ఆరెస్సెస్ రైట్వింగ్ భావజాలాన్ని, దాని హిందూ రాష్ట్ర లక్ష్యాన్ని మెచ్చుకు న్నాడు. వీధుల్లో ఆరెస్సెస్ చేసే బీభత్సాన్ని, ముస్లింలపై దాడులు, అల్లర్లపట్ల ఇష్టాన్ని తెలిపాడు. శ్వేతజాతి ఆధిక్యతతో, ఆరెస్సెస్ లక్ష్యాలకు పోలికలు న్నాయని, ఇరువురు ఒకరినొకరు సమన్వయం చేసుకోవాలని వివరించాడు. ఆరెస్సెస్.. నాజీ ల ప్రేరణతో అభివృద్ధి చెందింది. మోడీ.. ఆరెస్సెస్ నుంచి వచ్చిన వ్యక్తి. 2002 లో గుజరాత్లో దాదాపు 2000 మంది ముస్లింల ఊచకోత వెనుక మోడీ హస్తం ఉంది. అందుకే అమెరికాలోకి ప్రవేశించేందుకు ఆయనను పదేండ్లపాటు యూఎస్ ప్రభుత్వం నిషేధించింది, ఇప్పుడు ఆయన ఇనుపకంచెల సర్కారు హయాంలో క్రైస్తవులు, దళితులు, ముస్లింలు, సిక్కులు.. ఇంకా విద్వేషాన్ని, హింస ను, ఆరెస్సెస్ ఆధిక్యతను ధిక్కరించినవారందరూ అనుక్షణం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. మోడీ చేతులు రక్తంతో తడిశాయి. అమెరిక న్లు ఆయనతో కరచాలనం చేయడం సరికాద'ని పీటర్ అభిప్రాయపడ్డారు.