Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఖాట్మండ్ : పోలీస్ అధికారిపై కాల్పులకు పాల్పడ్డ కేసులో భారతీయుడిని అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ తెలిపారు. నిందితున్ని మహారాష్ట్రకు చెందిన మహ్మద్ సాహెబ్గా(40) గుర్తించామని అన్నారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని అన్నారు. ఖాట్మండ్ డీఎస్పీ బినోద్ విక్రమ్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం...మహ్మద్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఉత్తరప్రదేశ్ నుంచి నేపాల్కు వచ్చాడు. మార్గంమధ్యలో కారు డ్రైవర్ను బెదిరించి అతని దగ్గర ఉన్న డబ్బులు దోచుకున్నారు. నేపాల్లోని తులసీపూర్ చెక్పోస్టు వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న పోలీస్ అధికారిపై కాల్పులకు తెగబడ్డారు. మహ్మద్ను వెంబడించి అదుపులోకి తీసుకున్నామని బిన్ద్ విక్రమ్ సింగ్ తెలిపారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని అన్నారు.