Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దాడుల నేపథ్యంలో కీలక నిర్ణయం
వాషింగ్టన్: సౌదీఅరేబియాలోని అరామ్కో ప్రభుత్వ పెట్రోలియం శుద్ధి కేంద్రంపై డ్రోన్ల దాడిలో ఇరాన్ పాత్ర ఉందని అమెరికా ఆరోపిస్తున్నది. ఈ నేపథ్యంలో అమెరికా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నది. రక్షణ కల్పించే ఉద్దేశంతో సౌదీఅరేబియాకు అమెరికా భద్రతాబలగాలను పంపించనున్నట్టు ఆ దేశ రక్షణ కార్యదర్శి మార్క్్ ఎస్పెర్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. సౌదీతో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)కి సహకారరగా భద్రతాబలగాలను సౌదీకి పంపిస్తున్నమని తెలిపారు. సౌదీలో దాడులను అడ్డుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. అలాగే సౌదీ, యూఏఈకి సైనిక పరికరాల ఎగుమతి ప్రక్రియ వేగవంతం చేయనున్నామని తెలిపారు. అందులో భాగంగానే అణ్వాయుధాలను, మెరుగైన రాడార్లను, యుద్ధ విమానాలను అందించనున్నట్టు తెలిపారు.