Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇరాన్ ఆర్మీ చీఫ్ హెచ్చరిక
టెహ్రాన్: దేశ గగన తల నిబంధనలను అతిక్రమించిన డ్రోన్లను ఎలాంటి హెచ్చరిక లేకుండా కూల్చివేస్తామని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్సు దళాల (ఐఆర్జీసీ) చీఫ్ కమాండర్ మేజర్ జనరల్ హుస్సేని సలామి హెచ్చరించారు. ఆయన శనివారం నాడిక్కడ మీడి యాతో మాట్లాడుతూ, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఇరాన్ సి ద్ధంగా ఉందన్నారు. ఇరాన్పై ఎవరు దురాక్రమణకు పాల్పడినా దీటుగా సమాధానమిస్తామన్నారు. సౌదీ చమురు క్షేత్రాలపై డ్రోన్ల దాడి ఇరాన్ పనేనని ఆరోపిస్తున్న అమెరికా, సౌదీ అరేబియాను ఇరాన్కు వ్యతిరేకంగా రెచ్చగొట్టేందుకు యత్నిస్తున్న నేపథ్యంలో ఇరాన్ ఆర్మీ చీఫ్ ఈ హెచ్చరిక చేశారు. తమ భూ భాగాన్ని యుద్ధ రంగంగా మార్చాలని అనుకుంటే అలాగే కానివ్వండి అని ఆయన అమెరికానుద్దేశించి అన్యాపదేశంగా అన్నా రు. 'మా పై దాడిని తిప్పికొట్టడమే కాదు, దండెత్తి వచ్చినవారిని సర్వ నాశనం చేస్తామని హుస్సేని సలామి హెచ్చరించారు. సౌదీ చమురు క్షేత్రాలపై ఇరానియన్ డ్రోన్లు దాడి చేశాయన్న అమెరికా కట్టుకథలను చివరికి సౌదీయులు కూడా నమ్మే స్థితి లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి జరీఫ్ అన్నారు.