Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేషనల్ ఆర్మీ డే పరేడ్లో రౌహాని
టెహ్రాన్ : గల్ఫ్లో మోహరించిన విదేశీ బలగాలు తక్షణమే వెనక్కి వెళ్లిపోవాలి. గల్ఫ్లో విదేశీ బలగాల మోహరింపు కారణంగానే అభద్రతా భావం పెరిగింది. మేమంతా ఒక్కటే. ఇస్లామిక్ దేశాల మధ్య చిచ్చుపెట్టేందు కు కొన్ని దుష్టశక్తులు ప్రయత్నిస్తూనే ఉంటాయి. వాటి కుట్రలను మనం పసిగట్టి తిప్పిగొట్టాలి. విదేశీ బలగాలు వైదొలగినట్టయితేనే గల్ఫ్లో శాంతియుత వాతావరణం నెలకొనే అవకాశాలున్నాయి' అని ఇరాన్ అధ్యక్షుడు హస్సన్ రౌహాని అన్నారు. ఇరాన్ నేషనల్ ఆర్మీ డే పరేడ్లో ఆయన మాట్లాడారు. సౌదీకి అమెరికా బలగాలను పంపనున్నట్టు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొద్ది గంటలకే రౌహా ని పై వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రౌహాని అమెరికాపై పరోక్షంగా నిప్పులు చెరిగారు. గల్ఫ్ దేశాల మధ్య చిచ్చుపెట్టాలని అగ్రరాజ్యం కుట్ర పన్నిందన్నారు. జాతీయ సైనిక దినోత్సవంలో భాగంగా ఇరాన్ స్వల్ప శ్రేణి క్షిపణిని ప్రదర్శించింది. ఈక్షిపణి 2వేల కిలోమీటర్లు ప్రయాణించే సామర్థ్యాన్ని కల్గి ఉంటుందని తెలిపింది. ఈ ఏడాది జూన్లో ఇరాన్ గగనతలంలోకి సమాచార సేకరణ కోసం అమెరికా ఓ డ్రోన్ను పంపింది. ఈ డ్రోన్ను ఇరాన్ సైన్యం కూల్చేసిం ది. తన సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకు నేందుకే అమెరికా డ్రోన్ను కూల్చేసినట్టు ప్రకటించింది. కాగా, ఖోర్దాద్-3 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా అమెరికా డ్రోన్ను ఇరాన్ పసిగట్టింది. నేషనల్ ఆర్మీ డే పరేడ్లో ఖోర్దాద్-3 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను ఇరాన్ ప్రదర్శించింది. అనంతరం సైనికులు విన్యాసాలు ప్రదర్శించారు. రౌహాని గౌరవ వంద నం స్వీకరించారు. కాగా, ఇరాన్ అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలగిన అనంతరం ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేయొద్దని మిత్రదేశాలను అమెరికా హెచ్చరించిం ది. ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై భారీ ఆంక్షలు మోపింది. అంతేగాకుండా, గల్ఫ్ సముద్ర జలాల్లోని నౌకలపై జరిగిన దాడులు కూడా ఇరాన్ పనేనని ఆరోపించింది. సౌదీలోని రెండు చమురు క్షేత్రాలపై యెమెన్కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు డ్రోన్ల దాడులకు పాల్పడ్డారు. ఈ దాడులు కూడా ఇరాన్ పనేనని అమెరికా ఆరోపించింది. ఇరాన్పై పరోక్షంగా యుద్ధం ప్రకటించిన ట్రంప్ చివరి క్షణంలో వెనక్కి తగ్గారు. అమెరికా బలగాలను సౌదీకి పంపనున్నట్టు ప్రకటించారు. గల్ఫ్లో యుద్ధ వాతావరణం సృష్టించేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నా రనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే, సౌదీ తమ మిత్రదేశం కాబట్టే బలగాలను పంపించానని ట్రంప్ పేర్కొనడం గమనార్హం. చమురు క్షేత్రాలపై జరిగిన దాడుల వెనుక ఇరాన్ హస్తముందని ట్రంప్ చేసిన ప్రకటనను సౌదీ మాత్రం పట్టించుకోవడం లేదు. చమురు క్షేత్రాలపై డ్రోన్ల దాడుల ఘటనను విదేశీ బృందాలు దర్యాప్తు చేపడుతున్నా యని తెలిపింది. ఇరాన్ భూభాగం నుంచే ఈ దాడులు జరిగినట్టు దర్యాప్తులో వెల్లడైనట్టయితే దానిని ఇరాన్ తమపై యుద్ధం ప్రకటించినట్టుగా భావించాల్సి వస్తుంద ని సౌదీ ప్రకటించింది. కాగా, అమెరికా బలగాల ను తమ దేశానికి పంపించమని కూడా అమెరికాను సౌదీ కోరలేదు. అయినప్పటికీ, గల్ఫ్లో అశాంతియుత వాతావరణం, ఉద్రిక్త వాతావరణం సృష్టించేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఆ డ్రోన్లను కూల్చేస్తాం : ఇరాన్
తమ గగనతలంలో ప్రవేశించే డ్రోన్లను కూల్చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. సౌదీ అరేబియాలోని రెండు చమురు క్షేత్రాలపై ఈనెల14న డ్రోన్ల దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈదాడులకు బాధ్యత వహిస్తున్నట్టు యెమెన్కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. యెమెన్ మిలిటెంట్లను సౌదీపై ఇరాన్ ఎగదోసిందని అమెరికా ఆరోపించింది. అంతేగాకుండా, హౌతీ తిరుగుబాటుదారులకు డ్రోన్లను సరఫరా చేసిందని ఆరోపించింది. ఈనేపథ్యంలో ఇరాన్, అమెరికా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చమురు క్షేత్రాలపై జరిగిన దాడులు ఇరాన్ పనేనని అమెరికా చేసిన ఆరోపణలను సౌదీ మాత్రం అంగీకరించలేదు. 'ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటాం. దురాక్రమణదారులను తరిమి కొడతాం లేదా నాశనం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం' అని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్బ్స్ కమాండర్ మేజర్ జనరల్ హౌస్సెన్ సలామీ తెలిపారు.