Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆక్సీజన్ను కణాలు గుర్తించటంపై పరిశోధనకు పురస్కారం
స్టాక్హోం : మానవ శరీరంలో కణాలకు ఆక్సీజన్ అత్యంత కీలకమన్న విషయం శతాబ్దాల క్రితమే శాస్త్రీయంగా గుర్తించాం. కానీ శరీరంలో ఆక్సీజన్ స్థాయిలకు అనుగుణంగా కణాలు తమను తాము ఎలా మార్చుకుంటాయి? ఎలా స్పందిస్తాయి? అన్నది మాత్రం మొన్నటివరకూ తెలియదు. ఆ విషయంపై అద్భుతమైన పరిశోధన చేసిన 'ముగ్గురు శాస్త్రవేత్త'లకు 2019 నోబెల్ వైద్య పురస్కారం దక్కింది. 'మాలిక్యూలర్ మెకానిజం'పై కొత్త విషయాలు కనుగొన్న, అమెరికా పరిశోధకులు విలియం కైలిన్, గ్రెగ్ సెమెంజా, బ్రిటన్కు చెందిన పీటర్ రాట్క్లిఫ్లు ఈ ఏడాది నోబెల్ పురస్కారాన్ని పంచుకోను న్నారు. ప్రతి ఏటా నోబెల్ అవార్డుల ప్రకటన వైద్యరంగంతో మొదలవుతుందన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత వరుసగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, సాహిత్యం, శాంతి నోబెల్ పురస్కారాలు ప్రకటిస్తారు. అక్టోబరు 14 ఆర్థిక నోబెల్ ఎవరికి దక్కిందన్నది తెలుస్తుంది. శరీరంలోని కణాలు ఆక్సీజన్ను ఎలా గుర్తి స్తాయి? ఎలా స్వీకరిస్తాయి? ప్రాణవాయువు లభ్యతను బట్టి కణాల స్పందన ఎలా ఉంటుంది? అనే అంశాల పై జరిగిన పరిశోధనలకుగానూ వారిని నోబెల్ పురస్కారానికి ఎంపిక చేశామని కమిటీ వెల్లడించింది. వారి పరిశోధనలు క్యాన్సర్, అనీమి యాతోపాటు ఇతర వ్యాధులపై పోరాడేందుకు మంచిమార్గంగా ఉపయోగపడు తాయని తెలి పింది. 2019 సంవత్సరానికిగానూ వీరికి సంయుక్తంగా ఈపురస్కారాన్ని అందజేయనున్నట్టు పేర్కొంది. నగదు పురస్కారంగా 90,13,000 స్వీడీష్ క్రౌన్స్ అందజేస్తారు.