Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రసాయన,భౌతిక శాస్త్రాల్లో ...
- లిథియం ఆధారిత బ్యాటరీల రూపకల్పన చేసిన ముగ్గురికి..
- పాలపుంతపై విస్తృత పరిశోధనలు చేసిన మరో ముగ్గురికి.
స్టాక్ హోమ్: రసాయనిక శాస్త్రం క్యాటగిరీలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం వరించింది. జాన్ బి.గుడెనఫ్ (జర్మనీ), స్టాన్లీ విట్టింగ్హామ్ (బ్రిటన్), అకీరా యోషినో (జపాన్)లకు రసాయనిక శాస్త్రంలో నోబెల్ అవార్డును అందజే యనున్నారు. స్వీడన్లోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సెక్రెటరీ జనరల్ గొరాన్ కే హ్యాన్సన్ బుధవారం ఈ వివరాలను వెల్లడించారు. సెల్ ఫోన్లు, ల్యాప్ టాపు, ఎలక్ట్రిక్ కార్లల్లో వినియోగించే లిథియం ఆధారిత బ్యాటరీలను రూపొందిం చినందుగానూ వీరికి ఈ అవార్డులను అందజేయనున్నట్టు పేర్కొన్నారు.
ముగ్గురూ ప్రొఫెసర్లే..
1922లో జర్మనీలో జన్మించిన జాన్ బి. గుడెనఫ్(97) ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్నారు. యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్లో ప్రొఫెసర్గా పని చేస్తున్నారు. బ్రిటన్కు చెందిన ఎం స్టాన్లీ విట్టింగ్హామ్(77) కూడా అమెరికాలో ఉంటున్నారు. బింగ్ హ్యామ్టన్ యూనివర్శిటీ ప్రొఫెసర్ స్టాన్లీ 1941లో జన్మించారు. మీజో వర్శిటీ ప్రొఫెసర్గా పని చేస్తున్న అకీరా యోషినో 1948లో జపాన్లో జన్మించారు. రసాయనిక శాస్త్రంలో విస్తృత పరిశోధనలు చేపట్టారు. ప్రస్తుతం మనం వినియోగిస్తోన్న సెల్ ఫోన్లు, ల్యాప్ టాపులు, ఎలక్ట్రిక్ వాహనాల్లో వినియోగించే లిథియం ఆధారిత బ్యాటరీలను వారు కనుగొన్నారు.
వైర్ లెస్ రంగంలో విప్లవాత్మకం..
ఈ తరహా బ్యాటరీలను రూపొందించడమే కాకుండా ఎలా వినియోగించాలనే అంశంపైనా విస్తృత పరిశోధనలు చేశారు. ఫలితంగా లిథియం అయాన్ ఆధారిత బ్యాటరీలు అందుబాటులోకి వచ్చాయి. వైర్ లెస్ ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వస్తువుల వినియోగానికి విస్తృతం కావడానికి ఈ బ్యాటరీలే ప్రధాన కారణమని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, నోబెల్ ఫౌండేషన్ వెల్లడించింది. తక్కువ బరువుతో ఉండేలా, వందలాది సార్లు ఛార్జింగ్ చేయడానికి వీలుగా లిథియం అయాన్ ఆధారిత బ్యాటరీలకు ప్రధాన కారణమైన ఫార్ములాను కనుగొన్నారని ప్రశంసించింది.
విస్తృత పరిశోధనలు..
లిథియం అయాన్ల విద్యుత్ అయస్కాంత తరంగాలు ఆనోడ్, క్యాథోఢ్ మధ్య ఎన్నిసార్లయినా ప్రవహిస్తాయనే విషయాన్ని ఆధారంగా చేసుకుని ఈ బ్యాటరీలను రూపొందించినట్టు నోబెల్ ఫౌండేషన్ పేర్కొంది. విద్యుదావేశాన్ని అత్యధికంగా కలిగి ఉండే ఎలక్ట్రోడ్స్ వలయాలను ధ్వంసం చేయని విధంగా, ఎలాంటి కెమికల్ రియాక్షన్స్ వెలువడని విధంగా లిథియం అయాన్ బ్యాటరీలను రూపొందంచడం రసాయనిక శాస్త్రంలో ఓ గొప్ప మలుపుగా ఫౌండేషన్ అభిప్రాయపడింది. ఈ రంగంలో వీరు చేసిన పరిశోధనలు అంచనాలకు మించి ఫలించాయని పేర్కొంది. ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి సందర్భంగా డిసెంబర్10న స్టాకహేోమ్ లో జరుగనున్న కార్యక్రమంలో వీరికి అవార్డులను ప్రదానం చేస్తారు. అవార్డు కింద 9,18,000 డాలర్ల (రూ.6.5 కోట్లు) నగదు, బంగారు పతకాన్ని బహూకరిస్తారు. ఈ మొత్తాన్ని ముగ్గురు శాస్త్రవేత్తలకు కలిపి అందజేయనున్నారు.
పాలపుంతపై పరిశోధనలు చేసినందుకు...
అత్యంత సంక్లిష్టమైన ఫిజిక్స్లో ఈ ఏడాది ముగ్గురు శాస్త్రవేత్తలకు ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతి లభించింది. అంతరిక్షంలో కొన్ని వినూత్న పరిశోధనలు చేయడం, సరికొత్త గ్రహాలు, నక్షాత్రాలను కనుగొన్నందున వారికి ఈ అవార్డు లభించనుంది. జేమ్స్ పీబెల్స్, మైఖెల్ మేయర్, డిడియర్ క్వెలోజ్ లను ఫిజిక్స్ లో నోబెల్ బహుమతి కోసం ఎంపిక చేశారు. ఫిజికల్ కాస్మాలజీలో విస్తృత పరిశోధనలు చేసినందుకు కెనడాలోని ప్రిన్స్టన్ యూనివర్శిటీ ప్రొఫెసర్ జేమ్స్ పీబెల్స్, స్విట్జర్లాండ్లోని యూనివర్శిటీ ఆఫ్ జెనీవా ప్రొఫెసర్ మైఖెల్ మేయర్లకు ఉమ్మడిగా నోబెల్ బహుమతిని అందజేయనున్నట్టు తెలిపారు. ఈ ఇద్దరితో పాటు సూర్యుడి తరహా మరో సరికొత్త గ్రహాన్ని కనుగొన్నందుకు జెనీవా యూనివర్శిటీకే చెందిన డిడియర్ క్వెలోజ్ పేరును ఎంపిక చేశామని అన్నారు. మన పాలపుంతకు కొన్ని వందల కాంతి సంవత్సరాల దూరంలో సూర్యుడి తరహా అత్యంత భారీ గ్రహం ఉందనే విషయాన్ని క్వెలోజ్ కనుగొన్నారు. ఫిజిక్స్లో నోబెల్ బహుమతిని ఇవ్వడాన్ని 1901లో ప్రారంభించారు. ఇప్పటిదాకా 47 మందికి మాత్రమే ఫిజిక్స్లో నోబెల్ అవార్డు లభించింది. వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. ఫిజిక్స్లో నోబెల్ అవార్డును అందజేసేంత స్థాయిలో పరిశోధనలు లేకపోవడంతో ఈ క్యాటగిరీ కింద ప్రతీఏడాది అవార్డులను ప్రకటించడంలేదు.