Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒకరు మృతి : 30 మందికి గాయాలు
టోక్యో : జపాన్లో హగిబిస్ తుఫాన్ తీర ప్రాంతాన్ని అతలాకుతలం చేసింది. తుఫాన్ ధాటికి తూర్పు జపాన్లో ఒకరు మృతి చెందగా, 30 మందికి గాయాలయ్యాయి. తుఫాన్ శనివారం సాయంత్రం 4 గంటలకు ఉత్తర-ఈశాన్య దిశగా గంటకు 35 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి 90కిలోమీటర్ల దూరాన నైరుతి దిశలో ఉన్న షిమోడ, షిజుకోవ భూభాగాలను తాకింది. దేశ రాజధాని టోక్యోకు నైరుతి దిశలో కొండచరియలు భారీగా విరిగిపడ్డాయి. వీధులు, బీచ్లు, రైల్వే, బస్స్టేషన్లు నిర్జనమైపోయాయి. కార్లు నీటిలో తేలియాడుతున్నాయి. తుఫాన్ ప్రభావానికి గంటకు 216 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. చిబాలోని కొన్ని ప్రాంతాలలో విద్యుత్ ట్రాన్స్మిషన్లు దెబ్బతిన్నాయని టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ హోల్డింగ్స్ ఇంక్ తెలిపింది. విద్యుత్ లైన్లను మరమ్మతు చేస్తున్నట్టు తెలిపింది. దాదాపు 4000కు పైగా నివాసాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మధ్యాహ్నం 2.45 గంటల సమయానికి విద్యుత్ సరఫరా లేని నివాసాల సంఖ్య 5000కు చేరుకుంది. శనివారం అర్థరాత్రి నుంచి రానున్న 24 గంటల్లో టొకారు ప్రాంతంలో 1000 మిల్లిమీటర్ల వర్షాలు కురిసే అవకాశముంది. కాంటో-కొషిన్ ప్రాంతంలో 600 మిల్లీమీటర్లు వర్షాలు కురవనున్నాయని వాతావరణ సంస్థ తెలిపింది.
తుఫాన్ ధాటికి మెట్రోపాలిటిన్ ప్రాంతాల్లో రైలు, విమాన సర్వీసులను రద్దు చేశారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న రగ్బీ ప్రపంచ కప్ మ్యాచ్లు, కచేరీలు, ఇతర కార్యక్రమాలు రద్దు చేసినట్టు సంబంధిత అధికారులు తెలిపారు. జపాన్లో 1958 నాటి నుండి ఇంతటి భారీ తుఫాన్ ఎన్నడూ సంభవించలేదని వాతావరణ కేంద్రం తెలిపింది. అప్పుడు 1200మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, సుమారు 5లక్షల ఇండ్లు వరదల్లో మునిగిపోయాయి. షిజుకా జిల్లాలోని ఇజూ ద్వీపకల్పాన్ని దాటి తుఫాన్ తీరం చేరుకున్నదని జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. ఈ తుఫాన్ టోక్యోకు సమీపంలోని చిబా ప్రాంతా న్ని మరింత అతలా కుతలం చేసే అవకాశ ముందని పేర్కొంది. ఇదే ప్రాంతంలో గత నెలలో శక్తివంతమైన తుఫాన్ సంభవించింది. ఇచిహర ప్రాంతంలో సంభ వించిన తుఫాను ప్రభావా నికి ఒక నివాసం ధ్వంసమైం ది. ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ధ్వం సమైన ఈ నివాసం సమీపంలోనే బోల్తా పడి ఉన్న ఒక కారులో 50 సంవత్సరాల వృద్ధుడు మృతి చెందినట్టు స్థానిక అధికారులు తెలిపారు. తుఫాన్ తీవ్రతకు ఆ కారు బోల్తా పడిందని వారు చెప్పారు. హిగిబి తుఫాన్ కారణంగా దేశ వ్యాప్తంగా 30 మందికి గాయాలైనట్టు అధికారులు వెల్లడించారు.
సెంట్రల్ జపాన్ ప్రాంతాలైన మియి, షిజైక, కనగవ తదితర ప్రాంతాలతో పాటు ఆయా మున్సిపాల్టీలకు అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. ప్రత్యేకించి టోక్యోకు పశ్చి ప్రాంత ప్రజలు తమ ప్రాంతాలను ఖాళీ చేసి వెళ్ళాలని హెచ్చరించారు. పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు 17వేల మంది పోలీసులు, సైనికదళాలు రంగంలోకి దిగాయి.