Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 15న ముగిసిన తొలి విడత ఎన్నికలు
ట్యునీస్ : ట్యునీషియా అధ్యక్ష ఎన్నికల్లో ప్రముఖంగా ఇద్దరి మధ్య పోటీ నెలకొంది. ఒకరు మీడియా ప్రముఖులు నబిల్ కరోయి కాగా మరొకరు కన్సర్వేటివ్ పార్టీ న్యాయవాది కైయిస్ సయిద్. వీరిద్దరూ స్వయం ప్రకటిత 'వెలుపలి' అభ్యర్ధులే అయినప్పటికీ ట్యునీషియా రాజకీయాలను దిగ్భ్రాంతికి గురి చేశారు. గత నెల 15న జరిగిన తొలి విడత ఎన్నికల సందర్భంగా అధ్యక్ష పదవికి పోటీ చేసిన 26 మంది అభ్యర్దులలో వీరిద్దరూ ప్రముఖంగా నిలిచారు. సయిద్ 18.4 శాతం ఓట్లను సాధించుకోగా, కరోయి 15.6 శాతం ఓట్లను సాధించి రెండో స్థానంలో నిలిచారు. కరోయి కొన్ని రోజుల కిందటే జైలు శిక్ష అనుభవించి విడుదలయ్యారు. ట్యునీషియా అధ్యక్ష ఎన్నిలకు శుక్రవారం మధ్యాహ్నం చివరి విడత ప్రచారం జరిగింది. దీంతో తునిస్ రెండు విభిన్న సన్నివేశాలకు వేదికగా మారింది. మనీ లాండరింగ్, పన్ను ఎగవేతలకు సంబంధించి తనపై వచ్చిన ఆరోపణలను కరోయి తోసిపుచ్చారు. తనపై వచ్చిన అభియోగాలపై దేశంలో ఎన్నికలు ప్రారంభం కావడానికి ముందుకు ఆగస్టులో ఆయన జైలు కెళ్ళారు.
కరోయి వీటిని నిరాకరిస్తూ అవి రాజకీయ ఉద్దేశ్యంతో చేసిన అభియోగాలని చెప్పారు. స్వేచ్చ, నిష్పా క్షిక ఎన్నికల కోసం ఆయనను విడుదల చేయాలని ఒత్తిడి వచ్చిన నేప థ్యంలో గత వారంలో విడుదలయ్యారు. అయినప్పటికీ ఆయన ఎన్నికల ఫలితాలలో బాగానే రాణించారు. స్వతంత్ర అభ్యర్ధిగా పోటీలో ఉన్న సయ్యద్ తన ప్రత్యర్ధి జైలులో ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ నైతికత నేప థ్యంలో ప్రచారం చేయనన్నారు. స్థానిక కౌన్సిలకు అధికారాన్ని ఇవ్వడం ద్వారా రాజకీయ వ్యవస్ధను పనుర్వ్యవస్ధీకరిస్తానని ప్రతిపాదించారు. ఈ ఎన్నికల్లో తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకోనున్న రిహమ్ జలీలి (19)సయ్యిద్కు మద్దతిస్తానని తెలిపింది.