Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 16 మంది మృతి
ఔగడూగు : ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసోలో కాల్పుల కలకలం సృష్టించాయి. ఔగడూగు నగరంలోని మసీదులో జరిగిన కాల్పుల్లో 16 మంది మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు.క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. ఈ దాడులకు బాధ్యత వహిస్తున్నట్టు ఏ ఉగ్రసంస్థ కూడా ప్రకటించుకోలేదు. కాగా, గత కొన్నేండ్ల నుంచి విదేశీ బలగాలు బుర్కినా ఫాసోలో మోహరించి మిలిటెంట్లకు వ్యతిరేకంగా ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. విదేశీ బలగాలు తమ ప్రాంతం నుంచి వెనక్కి వెళ్లాలని పలు మిలిటెంట్ గ్రూపులు డిమాండ్ చేస్తున్నాయి. అయితే, మిలిటెంట్ల డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోవడంతో వరుస మెరుపు దాడుల ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.