Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సహాయక చర్యలు చేపట్టిన జపాన్
టోక్యో : జపాన్లో సంభవించిన 'హగిబిస్' తుఫాన్ ధాటికి మృతిచెందిన వారి సంఖ్య ఆదివారం నాటికి 19కి చేరింది. డజను మందికి పైగా గల్లంతయ్యారు. దీంతో అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. హెలికాప్టర్లు, పడవలు, వేలాది మంది బలగాలు దేశ వ్యాప్తంగా మోహరించి వరద నీటిలో మునిగిపోయిన నివాసాలలోని ప్రజలను బయటకు తెచ్చే సహాయ చర్యలు చేపట్టారు. దేశ వ్యాప్తంగా 14 నదులు ప్రవాహా స్థాయిని మించి ప్రవహించడంతో వరదలు సంభవించాయని ప్రభుత్వ రంగ టెలివిజన్ ఛానల్ ఎన్హెచ్కె తెలిపింది. తుఫాన్ సంభవించిన మరుసటి రోజు ఆదివారం ఉదయం ప్రభుత్వ ప్రతినిధి వెల్లడించిన క్షతగాత్రుల సంఖ్య కన్నా క్యోడో వార్తా సంస్ధ ప్రకటించిన మృతుల సంఖ్య అధికంగా ఉంది. ప్రత్యేకించి తూర్పు జపాన్లో తుఫాన్ నష్టం అత్యధికంగా జరిగిందని ప్రభుత్వ ప్రతిని యోషిహైడ్ సుగా ఇక్కడ విలేకరులకు తెలిపారు. దాదాపు 27,000 మంది సైనికులు, ఇతర సహాయక బృందాలు దేశ వ్యాప్తంగా సహాయ చర్యలు చేపడుతున్నాయని ఆయన చెప్పారు. దాదాపు 376,000 నివాసాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, 14,000 నివాసాలు వరద నీటిలో మునిగిపోయాయయని ఆయన చెప్పారు.