Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇస్లామాబాద్ : పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆదివారం ఇరాన్ బయలుదేరి వెళ్ళారు. అక్కడ ఆయన ఒక రోజు పర్యటించనున్నారు. ప్రాంతీయ ప్రత్యర్ధులుగా ఉన్న ఇరాన్, సౌదీ అరేబియాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఆయన చొరవ చూపనున్నారు. రియాద్ నేతృత్వంలోని సంకీర్ణ కూటమి 2015లో యెమెన్పై దాడి ప్రారంభించిన నాటి నుండి, గల్ఫ్లో 2016లో షియా మతాధిపతిని ఉరి తీసిన నాటి నుండి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది సెప్టెంబరు 14న గల్ఫ్లో చమురు స్థావరాలపై దాడి జరిగిన తర్వాత ఇరాన్, సౌదీ అరేబియాల మధ్య సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. చమురు స్థావరాలపై దాడికి ఇరాన్దే బాధ్యతని సౌదీ, దాని మిత్ర పక్షాలు ఆరోపించాయి. ఈ ఆరోపణలను ఇరాన్ తోసిపుచ్చింది. ఈ క్రమంలోనే ఈనెల11న ఇరాన్కు చెందిన చమురు ట్యాంకర్ సౌదీ తీరంలోని ఎర్రసముద్రంలో ఢకొీంది. 'ఇరాన్-సౌదీ ప్రాంతంలో శాంతి, భద్రతలను ప్రోత్సహించేందుకు చొరవ చూపడంలో భాగంగా ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆదివారం ఇరాన్ పర్యటించనున్నారు' అని పాక్ విదేశాంగ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
ఇమ్రాన్ ఖాన్ తన పర్యటలో భాగంగా ఇరాన్ నాయకత్వంతో సమావేశమవుతారు. ఇరాన్ ప్రధాని అయాతుల్లా ఖొమైనీ, అధ్యక్షుడు రౌహానితో ప్రత్యేక సమావేశం జరుపుతారు. గల్ఫ్లో శాంతి, భద్రతలకు సంబంధించిన అంశాలపై చర్చిస్తారు. వీటితో పాటు ద్వైపాక్షిక అంశాలు, ప్రాంతీయ పరిణామాలపై ప్రధానంగా చర్చిస్తారని ఆ కార్యాలయం వెల్లడించింది. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ ఏడాది ఇరాన్ పర్యటించడం ఇది రెండోసారి.